ఆగస్టు 25 నుంచి 27 వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి దివ్య తెప్పోత్సవాలు

టీటీడీ ఆధ్వర్యంలోని కార్వేటినగరం శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 25 నుంచి 27వ తేదీ వరకు భక్తి పారవశ్యాన్ని పంచే శ్రీ స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

తెప్పోత్సవాల్లో భాగంగా ఆగస్టు 25న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగస్టు 26, 27 తేదీల్లో శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నారు.

ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వేణుగోపాలస్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి ఆహ్వానిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *