శ్రీవారి ఆలయంలో ఉదయం 3.30 గం||ల నుండి భక్తులకు దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 3.30 గంటల నుంచే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే.
మంగళవారం వేకువజామున 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అష్టదళ పాదపద్మారాధన అనంతరం నిర్దేశించిన సమయానికంటే ముందుగానే భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *