మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున అధునాతన సౌకర్యాలు

 

 

భారతదేశంలో జరిగే మతపరమైన పండుగ అయిన కుంభమేళా. ఈ కుంభమేళాలో లక్షలాది మంది హిందూ యాత్రికులు పవిత్రంగా భావించే నదులలో స్నానమాచరిస్తారు.

ఈ సంవత్సరం 48 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ నగరంలో జరిగే కుంభమేళాకు 400 మిలియన్లకు పైగా ప్రజలు హాజరవుతారని అంచనా.

కుంభమేళా యొక్క ప్రాముఖ్యత

2025 కుంభమేళా ప్రారంభమైంది. భారతదేశంలోని అత్యంత పవిత్ర నది అయిన గంగానది, యమునా నది , సరస్వతి నదిలో సంగమించే త్రివేణి సంగమం వద్ద ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు స్నానాలు ఆచరించి తరిస్తున్నారు.

ముఖ్యమైన హిందూపండుగ

కుంభమేళా హిందూమతంలో అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగలలో ఒకటి, భూమిపై అతిపెద్ద మానవ కలయిక . ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్), హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని అనే నాలుగు పవిత్ర ప్రదేశాలలో కుంభమేళా కాలానుగుణంగా నిర్వహించబడుతుంది.

కుంభమేళాలు నాలుగు రకాలు. ప్రస్తుతం జరుగుతున్న పండుగ, మహా కుంభమేళా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళా జరుగుతుంది.  ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా ఇది అత్యధిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

లక్షలాది మంది భక్తులు, సన్యాసులు ఈ కుంభమేళాలో పవిత్రనదిలో స్నానాలు ఆచరిస్తారు. పాపాలను హరింపచేసుకుని జీవిత , మరణ చక్రం నుండి విముక్తిని పొందాలంటే కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయాలని పురాణాలు పేర్కొంటున్నాయి. 

పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథనం చేసే సమయంలో అమృతపు చుక్కలు పడిన నాలుగు ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. 

కుంభమేళాకు ఏర్పాట్లు 

అధునాతన సాంకేతికతను ఉపయోగించి ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.  ప్రయాగ్‌రాజ్‌లోని నది ఒడ్డున 160,000 టెంట్లు, 150,000 టాయిలెట్లు మరియు తాత్కాలిక ఆసుపత్రులతో తాత్కాలిక  నగరం నిర్మించబడింది .

రవాణా సదుపాయాలు

కుంభమేళాకు వచ్చే భక్తులకు రవాణా సదుపాయాలు మెరుగుపరిచేందుకు 98  ప్రత్యేక రైళ్లు   ప్రవేశపెట్టబడ్డాయి,   

కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కేంద్రీకృత  వార్ రూమ్‌లు  ఏర్పాటు చేసారు. సుమారు 40,000 మంది పోలీసులను బందోబస్తు కోసం మోహరించారు.  

ప్రాంగణం అంతటా 2,700 CCTV కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ AI- శక్తితో కూడిన నిఘా వ్యవస్థలో విలీనం చేయబడ్డాయి.

నిర్దిష్ట ప్రాంతాల్లోని వ్యక్తుల సంఖ్యను లెక్కించడానికి, గుంపు సాంద్రతపై సమాచారాన్ని అందించడానికి అల్గారిథమ్‌లు ఉపయోగించబడతాయి. అంచనాలకు మించి జనం రద్దీ పెరిగితే   అధికారులు అప్రమత్తం చేయబడతారు. గంగా, యమునా నదీ ప్రవాహాలను పర్యవేక్షించేందుకు తొలిసారిగా నీటి అడుగున డ్రోన్‌లను కూడా ఉపయోగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *