తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరిగింది.

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

మంగళవారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీ మలయప్పస్వామివారు వెండి తిరుచ్చిలో, శ్రీ కృష్ణస్వామివారు మరో తిరుచ్చిలో పార్వేట మండపమునకు చేరుకున్నారు. అనంతరం శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేటిలో ఉత్సహంగా పాల్గొన్నారు.

శ్రీ మలయప్పస్వామివారి తరపున అర్చకులు 3 సార్లు బాణం, ఈటె వేసి మాదిరి వేటను ప్రదర్శించి, భక్తులకు కనువిందు చేశారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *