తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస ఆలయంలో ఏప్రిల్ 22 నుండి 27వ తేదీ వరకు పునః ప్రతిష్ట, మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏప్రిల్ 22వ తేదీ ఆదివారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గటల వరకు చతుష్ఠానార్చన, సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు నిత్యహోమం, నూతన విగ్రహలకు దాన్యాధివాసం, ఏప్రిల్ 24వ తేదీ ఉదయం జలాధివాసం, సాయంత్రం క్షీరాధివాసం నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం శయ్యాధివాసం, ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం కర్మాంగ స్నపనం, పంచశయ్యాదివాసం జరుగనుంది. ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు పున: ప్రతిష్ట, మహాసంప్రోక్షణ అత్యంత వైభవంగా నిర్వహించి, అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

