కైలాసపర్వతంపై నీలవర్ణ శోభితుడు, చంద్రశేఖరుడు అయిన పరమేశ్వరుడు సకల దేవగణాలతో కూడి కొలువై ఉన్న వేళ పార్వతీదేవి లోక కళ్యాణార్ధమై ఓ పరిష్కారాన్ని కోరింది. స్వామీ లోకంలో ప్రజలు ఋణబాధలతో తల్లడిల్లుతున్నారు. వాటినుంచి వారికి విమోచన మార్గాన్ని తెలియజేయండి అని ప్రార్థించింది. అందుకు శివుడు కరుణార్ద్రహృదయుడై కేవలం విఘ్నాలనుంచే కాకుండా సకల జనులకు ఋణవిముక్తిని కలిగించే శక్తి కూడా గణపతికి ఉన్నందున ఋణవిమోచనార్ధం విఘ్నేశ్వరుని పూజిస్తే ఋణబాధల నుంచి విముక్తులవుతారు అని మార్గోపదేశం చేశాడు. ఈ ఋణహరగణపతి స్తోత్రాన్ని నిత్యం కనీసం మూడుసార్లయినా పఠిస్తే మీరు అనుభవించే దారుణ ఋణబాధల నుంచి కూడా విముక్తులవుతారు. అంటే మీ ఋణాలను తీర్చే శక్తిమీకు ఆ విఘ్నేశ్వరుడు కలుగచేస్తాడు.
సహస్రావర్తనాత్ సద్యో వాంఛితం లభతే ఫలమ్ భూతప్రేత పిశాచానాం నాశనం స్మృతి మాత్రతః
Temple Tour Guide will guide you how to perform Poojas and Vratas on your home, We will explain you the significance of festivals and important days in Hindu calendar. We are here to promote Hindu culture and Traditions in the way to protect them.