చంద్ర గ్రహణం కారణంగా ఆగస్టులో శ్రీవారి ఆలయంమూత

చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

ఆగస్టు 7వ తేదీన రాత్రి 10.52 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఆగస్టు 8న ఉదయం 12.48 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఆగస్టు 8న ఉదయం 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అష్టదళ పాదపద్మారాధన అనంతరం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

ఆగస్టు 7న ఆర్జిత సేవలు రద్దు

చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీన సోమవారం విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *