సెప్టెంబరు 12న శ్రీ వరాహస్వామి జయంతి

ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 12న వరాహ జయంతి ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం మూలవర్లకు వేదోక్తంగా అభిషేకం నిర్వహిస్తారు.

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం.

శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *